PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యార్థులకు ట్యాబులు పంపిణీ…

1 min read

పల్లెవెలుగు  వెబ్ చెన్నూరు : చెన్నూరు మండలంలో గల అన్ని ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి విద్యార్థినులక మంగళవారం ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు చేతుల మీదుగా టాప్స్ పంపిణీ చేయడం జరిగింది, ఈ కార్యక్రమాన్ని ముందుగా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల యందు మండల ప్రజా పరిషత్ చైర్మన్ సురేష్ యాదవ్, వైయస్సార్ చెన్నూర్ కన్వీనర్ జీఎన్ భాస్కర్ రెడ్డి, సర్పంచ్ సిద్ది గారి వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో చేతుల మీదగా పంపిణీ చేయడం జరిగింది, ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ జగనన్న పుట్టినరోజు సందర్భంగా బై జ్యుస్ ట్యాబ్ లు విద్యార్థినిలకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ జీన్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు అందరికీ మేనమామ అయినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐఎఫ్బి ప్యానల్స్ నాడు- నేడు,టెక్స్ట్ బుక్స్,నోట్ బుక్స్,బెల్టు అందించడం ఎంతో సంతోషించవలసిన విషయం అన్నారు, మండల విద్యాశాఖ అధికారి గంగిరెడ్డి మాట్లాడుతూ ఎనిమిదో తరగతి విద్యార్థులు మొత్తం 268 మంది ఉన్నారని వారి అందరికీ ట్యాబులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు, ఎంఈఓ 2 సునీత మాట్లాడుతూ బైజుస్ ట్యాబ్ కంటెంట్ పూర్తి చేసి విద్యార్థులు మంచి జ్ఞానాన్ని సంపాదించాలని, చదువులో కూడా తెలివిగా ఉండాలని తెలియజేశారు,ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ ప్రధాన ఉపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

About Author