PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ద్వారకా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్

1 min read

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  :  ద్వారకా తిరుమల శ్రీవారిని ఏలూరు జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ సతీ సమేతంగా శ్రీవారి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ద్వారకా తిరుమల శ్రీవారి క్షేత్రాన్ని స్మోక్ ఫ్రీ జోన్ గా డిక్లరేషన్ సర్టిఫికెట్ అందజేయునిమిత్తం ద్వారకా తిరుమల వచ్చిన కలెక్టర్ దంపతులు శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది.  కలెక్టర్ దంపతులకు కార్యాలయం ఈవో వేండ్ర త్రినాధరావు, వేదపండితులు స్వాగతం పలికారు.  అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.  కలెక్టర్ దంపతులకు దేవస్ధానం వేదపండితులు ఆశీర్వచనం గావించారు.  ఆలయ ఈవో త్రినాధరావు కలెక్టర్ దంపతులకు స్వామివారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు రాజేష్, యంపిడివో సుబ్బరాయన్, ఆలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author