NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సైన్సు ఫైర్ లో జిల్లా ప్రథమ స్థానం..

1 min read

– ప్రథమ స్థానంలో నిలిచి విద్యార్థినితో పాఠశాల యాజమాన్యం

పల్లెవెలుగు  వెబ్​  చాగలమర్రి: చాగలమర్రి పట్టణంలోని భారతీవిద్యామందిరం పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న సబియా సైన్సుఫైర్ జిల్లా ప్రథమ స్థానం సాధించిందని ప్రధానోపాధ్యాయులు ప్రసాదు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీవిద్యామందిరం పాఠశాలల అధ్వర్యంలో బేతంచెర్లలో ఇటీవల జరిగిన జిల్లాస్థాయి సైన్సుపేర్ పోటీల్లో పాల్గొనడం జరిగిందన్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలో 17పాఠశాలలు పాల్గొనగా ఫస్ట్ ఎయిడ్ బాక్సు విభాగంలో తమ పాఠశాల విద్యార్థిని అద్భుత ప్రతిభ కనబరచి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఈ సందర్భంగా మంగళవారం స్థానిక పాఠశాలలో విద్యార్థినిని అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల కమిటీ సభ్యులు చెంచుసుబ్బారావు, సుంకురాజేష్, సిబ్బంది పాల్గొన్నారు.

About Author