PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వివాహానికి హాజరైన ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షులు

1 min read

పల్లెవెలుగు వెబ్  మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని 49 బన్నూరు గ్రామానికి చెందిన షేక్ పెద్ద హసన్ భాష కుమారుడు షేక్ హుస్సేన్ భాష  వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.శుక్రవారం నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామంలో జరిగిన వివాహం నిఖా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల జిల్లా సమాచార సాంకేతిక విభాగం జిల్లా అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.ఈ వివాహ శుభకార్యానికి సుదర్శన్ రెడ్డి,గ్రామ సర్పంచ్,సాంబ శివుడు,షేక్ అహ్మద్, హరీష్ మరియు వివిధ గ్రామాల నాయకులు హాజరై వారిని ఆశీర్వదించారు.

About Author