NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీసీ కెమెరా వ్యవస్థ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ

1 min read

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  :ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో ఆధునిక సీసీ కెమెరాల వ్యవస్థను ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మత్తుపదార్థాల వినియోగం, అక్రమ రవాణాపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఇతర రాష్ట్రాల్లో చోటుచేసుకుంటున్న ఎన్కౌంటర్ల నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని,జిల్లా షెల్టర్ జోన్ ప్రాంతాల్లో కుంబింగ్ నిర్వహించామని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో భద్రతను కఠినంగా అమలు చేస్తున్నామని తెలిపారు. చోరీ కేసులలో విజయవంతమైన విచారణ – బాధితులకు ఆస్తుల అప్పగింత నిర్వహించామన్నారు.జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పరిధిలో ఇటీవల జరిగిన చోరీల కేసులను పోలీసులు ఛేదించి, చోరీకి గురైన ఆస్తులను బాధితులకు తిరిగి అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు పోలీస్ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. న్యాయం చేకూర్చిన పోలీసు సిబ్బందిని అభినందించారు.పబ్లిక్ గ్రీవెన్స్‌లో ఎస్పీ స్వయంగా ఫిర్యాదుల స్వీకరణప్రజల సౌకర్యార్థం ప్రతి సోమవారం నిర్వహించే పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంను ఈరోజు (16.06.2025) జంగారెడ్డిగూడెం డిఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ నిర్వహించారు. సైబర్ నేరాలపై హెచ్చరికఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ,ఆధునిక ఆండ్రాయిడ్ ఫోన్ల వాడకంతో సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. “CBI, ED అధికారులు అంటూ బెదిరించడం, వ్యాక్సిన్ కొరకు ఒకటి నొక్కండి’ వంటి మెసేజ్‌లు పంపి ప్రజలను మోసం చేయడం వంటి మార్గాల్లో సైబర్ నేరగాళ్లు ప్రజల డేటా, డబ్బులను దోచుకుంటున్నారు. అలాంటి సందేశాలకు స్పందించకుండా, అప్రమత్తంగా ఉండాలి.ఎవైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నెంబరు కు కాల్ చేసి పోలీసుల సహాయం పొందాలి” అని హెచ్చరించారుఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం డిఎస్పి యు రవిచంద్ర,  జంగారెడ్డిగూడెం ఇన్స్పెక్టర్ కృష్ణ బాబు, జంగారెడ్డిగూడెం ఎస్సై జబీరు  జంగారెడ్డిగూడెం పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది పాల్గొన్నారుఏలూరు జిల్లా ప్రధాన కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహణ ఈరోజు ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్)ఎన్. సూర్యచంద్రరావు పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 40 మంది ప్రజలు హాజరై తమ ఫిర్యాదులు సమర్పించారు. అందిన ఫిర్యాదులపై సంబంధిత శాఖాధికారులతో ఫోన్ ద్వారా సంప్రదించి,తక్షణ చర్యలు తీసుకోవాలని అదనపు ఎస్పీ ఆదేశాలీచ్చారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *