NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములుకు ఘన నివాళులు అర్పించిన జిల్లా ఎస్పీ

1 min read

– కర్నూలు  జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్  .

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  నవంబర్ 1 వ తేది బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి  జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్  పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ …అమ‌ర‌జీవి శ్రీ పొట్టిశ్రీరాములు  త్యాగ ఫ‌లం,  తెలుగువారికి ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్పడిందని , ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవిగా పేరొందిన మహాపురుషుడుగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో  పాటు  ఎఆర్ అడిషనల్ ఎస్పీ జి. నాగబాబు,  ఎఆర్ డిఎస్పీ ఇలియాజ్ భాషా,  స్పెషల్ బ్రాంచ్ సిఐ ప్రసాద్,  ఆర్ ఐ లు వియస్ రమణ, పోతలరాజు , శివారెడ్డి , పోలీసు సిబ్బంది  పాల్గొన్నారు.

About Author