PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సబ్ ట్రెజరీని సందర్శించిన జిల్లా ట్రెజరీ అధికారి   

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ సబ్ ట్రెజరీ జిల్లా ట్రెజరీ అధికారి  రామచంద్రరావు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఫించాన్ దారుల సమస్యలపై జిల్లా అధికారి స్థానిక సబ్‌ ట్రెజరీ నందు సమావేశం ఏర్పాటు చేసి ఫించన్ దారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెన్షన్ దారుల అధ్యక్షడు T.M.D హుస్సేన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, పెన్షన్ దారుల సమస్యలను పరిష్కరించాలని జిల్లా ట్రెజరీ అధికారికి సూచించారు. ఇందుకు సమాధానంగా తమ పరిధిలో ఉన్న పెన్షన్ దారుల సమస్యలను పరిష్కరిస్తామని, మిగతా సమస్యలను రాష్ట్రస్థాయిలో పరిష్కారం కోసం పంపుతామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా APNGO తాలూకా అధ్యక్షుడు సాయి బాబా, ఇతర సంఘం సభ్యులు, ఫించన్ దారులు సంఘం  APNGO సంఘం ఆధ్వర్యంలో జిల్లా ట్రెజరీ అధికారులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఫించన్ దారులు జయరాములు, ప్రతాప్, పెద్దయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author