PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లా యోగాసన నూతన కార్యవర్గం ఎన్నిక

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:         శనివారం జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియంలో ఉన్న యోగహాలు నందు జరిగిన యోగాసనా అసోసియేషన్ ఆఫ్ కర్నూల్  జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికల  సమావేశం నిర్వహించారు.  జిల్లా నూతన అధ్యక్షుడిగా ఎస్.వి శివరాజ్, కార్యదర్శిగా ఈ. ప్రభాకర్, కోశాధికారిగా పి.సుధాకర్ ఉపాధ్యక్షులుగా ఉపేంద్ర గౌడ్, నరేష్ గౌడ్, సంయుక్త కార్యదర్శిగా శ్రీనివాస్ కళ్యాణ్ , కార్యవర్గ సభ్యులుగా రంగనాథ్ ,సురేష్, పెద్దయ్య , శ్రీనివాస్ వర్మ, వీర కుమార్ గౌడ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు ఎన్నికల అధికారిగా సురేష్ , జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ పర్యవేక్షకుడిగా గంగాధర్ హాజరయ్యారు. నూతన కార్యవర్గం అధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వారిచే గుర్తింపు పొందిన నేషనల్ యోగాసనా స్పోర్ట్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జైదీప్ ఆర్య వారిచే గుర్తించిన యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారికి అనుబంధంగా కర్నూలు జిల్లాలో తాము పని చేస్తున్నట్లు తెలియజేస్తూ.. ముందు ముందు కార్యక్రమాల వివరాల త్వరలో తెలియపరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యోగ శిక్షకుడు కళ్యాణ్, నబి రసూల్, నరేష్, ఈశ్వర్ , పెద్దయ్య , మల్లి, రెహమాన్, చెన్నయ్య, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

About Author