PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పరిపాలన సౌలభ్యం కోసమే జిల్లాలు !

1 min read

పల్లెవెలుగువెబ్ : పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినట్టు ఏపీ ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయ్ కుమార్ తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటు పై లోతైన అధ్యయనం జరిగిందన్నారు. జిల్లాల సరిహద్దులు ఎలా ఉండాలనేదానిపై అధ్యయనం చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటుపై విజయ్‌ కుమార్‌ గురువారం ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భౌగోళిక అంశాలు, రవాణా సౌకర్యాలు, మౌలిక వసతుల ఆధారంగా పరిశీలన జరిగిందన్నారు. ప్రజల మనోభావాలను, చారిత్రక నేపథ్యాలను అధ్యయనం చేశామని, ప్రతి జిల్లాకు రెండు రెవెన్యూ డివిజన్లను ప్రతిపాదించామని విజయ్‌ కుమార్‌ తెలిపారు.

    

About Author