PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెన్షన్ డబ్బును కాంట్రాక్టర్లకి మళ్లించిన ద్రోహి జగన్ రెడ్డి

1 min read

గౌరు చరిత వెంకట రెడ్డి దంపతులు..

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  మాధవి నగర్ నివాసం లో గౌరు దంపతులు  మాట్లాడుతూపెన్షన్ల పేరుతో రాజకీయ లబ్ధి పొందెందుకు జగన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని చరిత రెడ్డి ఆరోపించారు.పెన్షన్ల పేరుతో రాజకీయ లబ్ది పొందేందుకు జగన్ రెడ్డి కుట్రలు.ప్రజలకు పెన్షన్ల పంపిణీ చెయ్యకుండా చేసి, ప్రతి పక్షాల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు జగన్ రెడ్డి.ఈసి వంకతో పంపిణీ, ఎగ్గొట్టే యత్నం. నిధులు ఇవ్వకుండా విపక్షాలపై దుష్ప్రచారం. చివరి లబ్ధిదారుడి వరకు పెన్షన్ ఇవ్వాల్సిందే. అడ్డదారుల్లో అస్మదీయులకు వేలకోట్ల బిల్లులు చెల్లింపు. అవ్వా తాతల పెన్షన్ల డబ్బులు బినామీ కాంట్రాక్టర్లకు దోచిపెట్టె హక్కు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  కి ఎవరు ఇచ్చారు? అని చరిత రెడ్డి దంపతులు మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్,కల్లూరు అర్బన్ కన్వీనర్ పెరుగు పురుషోత్తం రెడ్డి, తెలుగు యువత రాష్ట ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్ పాల్గొన్నారు.

About Author