PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చెడుపై మంచి సాధించిన విజయం దీపావళి

1 min read

పల్లెవెలుగు, వెబ్​ కర్నూలు: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని హోటల్ మౌర్య కాంప్లెక్స్ లో ఉన్న టీజీవీ గ్రూప్ సంస్థల కార్యాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా టీజీవీ గ్రూపు సంస్థల సీనియర్ సీ ఎం డీ, మాజీ ఎంపీ టిజి వెంకటేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీజీవీ గ్రూప్ సంస్థ ఉద్యోగుల తో పాటు సిబ్బంది ,వారి పిల్లలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని టి జి వీ గ్రూప్ సంవత్సల కార్యాలయంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పరస్పరం దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం మాజీ ఎంపీ టీజీవీ గ్రూపు సంస్థ ల సీఎండీ టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా నిర్వహించుకునే దీపావళి పర్వదిన వేడుకలు ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో నిర్వహించుకొని ఆధ్యాత్మిక భావాలను పెంపొందించుకోవాలని ఆకాంక్షించారు.

About Author