NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డి.ఎం. పి.జి విద్యార్థుల సేవ.. భేష్​..

1 min read

బీరువా, ఫ్రిడ్జ్​ అందజేసిన డిఎం పి.జి. విద్యార్థులు సత్య కుమార్​, డా. మహేష్​

  •  అభినందించిన కార్డియాలజిస్ట్​ ప్రొఫెసర్​ డా. చంద్ర శేఖర్​

కర్నూలు, న్యూస్​ నేడు:ప్రతి ఒక్కరూ తాము సంపాదించిన దాంటో ఎంతో కొంత సమాజ సేవకు, చదివిన పాఠశాలకు, కళాశాలకు వెచ్చించాలని సూచించారు కార్డియాలజిస్ట్​ ప్రొఫెసర్​ డా. చంద్ర శేఖర్​.  కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని కార్డియాలజి విభాగానికి  డిఎం. పిజి ఫైనల్​ ఇయర్​  విద్యార్థులు డా. సత్య కుమార్​, డా. మహేష్​  రూ.40వేలు విలువ చేసే బీరువా, ఫ్రిడ్జ్​ విరాళంగా అందజేశారు. డి.ఎం. పిజి విద్యార్థుల సమక్షంలో బీరువా, ఫ్రిడ్జ్​ ను ఓపెన్​ చేసిన డా. చంద్ర శేఖర్​ మాట్లాడారు. డిఎం పిజి విద్యార్థులు సత్య కుమార్​, డా. మహేష్​ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. భవిష్యత్​ లోనూ ప్రజలకు వైద్య సేవ చేస్తూ… సమాజ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.  ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందించి.. అందరి మన్ననలు పొందాలని ఈ సందర్భంగా కార్డియాలజిస్ట్​ ప్రొఫెసర్​ డా. చంద్ర శేఖర్​ ఆకాంక్షించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *