PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దు

1 min read

– గ్రీవెన్స్ సెల్ లో అధికారులతో ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు
పల్లెవెలుగు వెబ్​, చిట్వేలి: ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం వహించవద్దని అధికారులకు సూచించారు ప్రభుత్వ విప్​ కొరముట్ల శ్రీనివాసులు. సోమవారం ఓబులవారిపల్లె మండలం తహసీల్దార్​ కార్యాలయంలో ప్రజా స్పందన కార్యక్రమం జరిగింది. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు స్వీకరించి… పరిష్కారం గురించి ఎంఆర్ఓతో చర్చించారు. ప్రజల నుంచి వచ్చే భూ సమస్యలు, ఫ్యామిలీ సర్టిఫికెట్, రేషన్ కార్డ్ తదితర ప్రజా సంక్షేమ పథకాలకు అవసరమైన సర్టిఫికెట్లు మంజూరు చేయుటలో జాప్యం చేయవద్దని ఎమ్మార్వోని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి మండల కన్వీనర్ సాయి కిషోర్ రెడ్డి, కోడూరు సి.ఐ విశ్వనాధ రెడ్డి, ఎమ్మార్వో వెంకటసుబ్బయ్య, ఆర్ ఐ రామ్మోహన్, సర్వేయర్ రామ్మోహన్, మండల వీఆర్వోలు, తదితరులు పాల్గొన్నారు.

About Author