PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజా సమస్యల పరిష్కారాలపై నిర్లక్ష్యం చూపొద్దు

1 min read

– సోమవారం వచ్చిన అర్జీలను శనివారం లోపు పరిష్కారం అయ్యేటట్టు చర్యలు తీసుకోండి.
– ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ గారు.
పల్లెవెలుగు వెబ్ ఆదోని: స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను ఏ ఒక్క అధికారి నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి అర్జిదారులను సంతృప్తిపరిచేలా చూడాలని ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ సూచించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నందు స్పందనలో పాల్గొని డివిజన్లోని ఆయా మండలాల నుంచి వచ్చిన ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మండలంలోని ఆయా శాఖల అధికారులకు సంబంధించిన సమస్యలను తెలియజేస్తూ వారంలోపు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ ఎస్ ఎల్ ఏ లోకి వెళ్లకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిపాలన అధికారి గోవింద్ సింగ్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వేణు సూర్య, మున్సిపల్ మేనేజర్ విజయ్ భాస్కర్ రెడ్డి, సీనియర్ సహాయకులు రామయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author