PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అక్క‌డ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి విగ్ర‌హం పెట్టొద్దు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పల్నాడు జిల్లా నరసరావుపేట మయూరి సెంటర్‌లో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహం ఏర్పాటుకు ఇటీవల భూమి పూజ జరిగింది. అయితే ప్రజలు తిరిగే స్థలంలో విగ్రహం పెడితే ఇబ్బంది పడాల్సి వస్తోందని నరసరావుపేటకు చెందని గూడూరి శేఖర్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ప్రజలు ఉపయోగించే స్థలాల్లో అనుమతి లేకుండా విగ్రహాలు పెట్టవద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ..అనధికారికంగా విగ్రహాలు పెట్టేందుకు వీలులేదని పల్నాడు జిల్లా కలెక్టర్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. విగ్రహం పెట్టే ముందు అధికారులు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించింది.

                                     

About Author