NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కొత్త జీతాలు వద్దు..పాత జీతాలు ఇప్పించండి

1 min read

 పల్లెవెలుగు వెబ్​,ఏలూరు : పిఆర్ సి సాధన సమితి ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల సంఘల ఆధ్వర్యంలో జరిగిన రిలే నిరాహారదీక్ష కార్యక్రమంలో ఏలూరు అన్ని విభాగాల నుంచి ఉద్యోగులు పాల్గొన్నారు, ఉద్యోగులు హక్కుల సాధనకై గత 2 రోజుల నుంచి దీక్షా శిబిరంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు,మూడవరోజు కూడా కొనసాగాయి,కొత్త జీతాలు వద్దు, పాత జీతాలు మాకు వెంటనే ఇప్పించాలని  డివిజనల్ ఖజానా కార్యాలయం సిబ్బంది. సహాయ ఖజానా అధికారి డి కృష్ణంరాజుకు వినతి పత్రాన్ని అందజేశారు,సిబ్బంది  మాట్లాడుతూ ప్రభుత్వం పిఆర్ సి విషయంలో మొండిగా వ్యవహరిస్తోందని అన్నారు,ప్రభుత్వం ఇప్పటికైనా దిగిరాకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వ వైఖరిని మారేంతవర కు కొనసాగిస్తామన్నరు.

About Author