PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగనన్న నరకాసుర పాలన వద్దు..

1 min read

– టిడిపి పట్టభద్రుల అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డికే మీప్రథమ ఓటు
పల్లెవెలుగు , వెబ్​ మిడుతూరు: పశ్చిమ రాయలసీమ పట్టబద్రుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని గెలిపించాలని,పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమం మరియు ప్రచారంలో భాగంగా మిడుతూరు మండల కేంద్రంలో ఉన్న వివిధ పాఠశాలలు,కళాశాలలు మరియు ప్రభుత్వ కార్యా లయాలలో ప్రచారం నిర్వహించారు.అధ్యాపకులు మేధావులు పట్టభద్రులు ఆలోచించి ప్రజావ్యతిరేక ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని నరకాసుర పాలనకు చరమగీతం పాడాలని రాష్ట్రంలో జగనన్న నరకాసుర పాలన పోయి ప్రజాపాలనకే పట్టం కట్టాలని తెలుగుదేశం పార్టీ పట్టభద్రుల అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని ప్రథమ ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని నందికొట్కూరు నియోజకవర్గ టిడిపి అధికార ప్రతినిధి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి,మిడుతూరు మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి పట్టబద్రులను కోరారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ స్వామి జూపల్లి,ఐటీడిపి మండల అధ్యక్షుడు ఇంతియాజ్, తెలుగు యువత నాయకులు సతీష్,సూరి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author