NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఏమీ చేయ‌లేవ్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పవన్‌కల్యాణ్‌పై జగన్‌ ప్రభుత్వం కక్ష సాధిస్తుందని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. జగన్‌కు చిరంజీవి దండం పెట్టడం బాధ కలిగించిందని ఆయన అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ, పవన్‌కల్యాణ్‌ పైన జగన్‌ కక్ష కట్టాడని అతనికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరిపై కక్ష సాధిస్తున్నాడని ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ జగన్‌తో చిత్ర పరిశ్రమ భేటీ రోజు చిరంజీవిగారు దండం పెట్టడం చూసి ఏడుపొచ్చింది. ఆయన కింది స్థాయి నుంచి వచ్చి స్వయంకృషితో ఎదిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ధీనంగా సినిమా పరిశ్రమ బాగు గురించి దండం పెట్టి అడిగాడు. ఆయనకు జగన్‌ ముందు తల దించాల్సిన అవసరం లేదు. కష్టాల గట్టు ఎక్కించమని తల దించి కోరింది ఆయన్ను పైకి తెచ్చిన సినిమా పరిశ్రమ గురించి. నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరినీ టార్గెట్‌ చేస్తావా? జగన్‌.. నువ్వు పవన్‌కల్యాణ్‌ను ఏమీ చేయలేవు. కక్ష సాధింపు వల్ల థియేటర్‌ ముందు పల్లీలు అమ్ముకునే వారి నుంచి నిర్మాత వరకూ ఇబ్బంది పడుతున్నాడు అని జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి అన్నారు.

                                                 

About Author