NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాబాయ్ హ‌త్య‌తో సంబంధం లేద‌ని ప్ర‌మాణం చేసే ద‌మ్ముందా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: తిరుమలకు వెళ్తున్న జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. వైఎస్ వివేకానంద హత్యతో తనకు కానీ, తన కుటుంబానికి కానీ సంబంధం లేదని 14-4-21న కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రమాణం చేశానని లోకేశ్ చెప్పారు. మీ బాబాయ్ హత్యతో మీకు, మీ కుటుంబ సభ్యులకు సంబంధం లేదని శ్రీవారి సాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధమా జగన్ రెడ్డి? అని లోకేశ్ ప్రశ్నించారు. తిరుమలకు వెళ్తున్న మీరు శ్రీవారిపై ప్రమాణం చేస్తారా? లేక బాబాయ్ పై గొడ్డలి పోటు జగనాసుర రక్త చరిత్ర అని ఒప్పుకుంటారా? అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు తోడుగా అబ్బాయ్ కిల్డ్ బాబాయ్ అనే హ్యాష్ ట్యాగ్ పెట్టారు.

                                     

About Author