PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఒలంపిక్స్ హీరో నీర‌జ్ కు ఇస్తున్న న‌గ‌దు బ‌హుమ‌తి ఎంతో తెలుసా ?

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : జావెలిన్ త్రో క్రీడ‌లో భార‌త చ‌రిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టించిన నీర‌జ్ చోప్రా.. ఇప్పుడు భార‌త దేశ ప్రజ‌ల హీరోగా నిలిచాడు. 23 ఏళ్ల ఈ కుర్ర అథ్లెట్ కు భారీ న‌గ‌దు బ‌హుమ‌తి ల‌భించింది. గ‌తంలో అనేక పోటీల్లో గెలిచిన‌ప్పుడు రాని పేరు ప్రఖ్యాత‌లు, న‌గదు బ‌హుమ‌తులు నీర‌జ్ చోప్రాకు ఇప్పుడు వ‌స్తున్నాయి. స్వర్ణం గెలిచిన నీర‌జ్ చోప్రాకు కేంద్ర ప్రభుత్వం నుంచి 75 ల‌క్షలు అంద‌నుంది. నీర‌జ్ సొంత రాష్ట్రం హ‌ర్యాణ ప్రభుత్వం 6 కోట్లు ఇస్తామ‌ని ప్రక‌టించింది. పంజాబ్ 2 కోట్లు, మ‌ణిపూర్ కోటి రూపాయ‌లు న‌గ‌దు బ‌హుమ‌తి ప్రక‌టించాయి. బైజూ సంస్థ 2 కోట్లు, బీసీసీఐ కోటి రూపాయ‌లు, ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూప‌ర్ కింగ్స్ కోటి రూపాయ‌ల న‌గ‌దు బ‌హుమ‌తి ప్రక‌టించాయి. మొత్తంగా 13 కోట్ల న‌గ‌దు బ‌హుమ‌తి సాంకేతికంగా నీర‌జ్ చోప్రా పొంద‌నున్నాడు. అంతే కాక ఆనంద్ మ‌హీంద్రా ఎక్స్యూవీ 700 మోడ‌ల్ కారును బ‌హుమ‌తిగా ప్రక‌టించారు. ఇండిగో విమాన సంస్థ సంవ‌త్సరం పాటు ఉచిత విమాన సౌక‌ర్యం క‌ల్పించింది.

About Author