PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మానవాభివృద్ధిలో భార‌త్ స్థానం ఎంతో తెలుసా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : యూఎన్ డీపీ తాజాగా 2021-22 మానవాభివృద్ధి సూచీని విడుదల చేసింది. మొత్తం 191 దేశాలు ఉన్న ఈ జాబితాలో భారత్ 132వ స్థానంలో నిలిచింది. 2020లో భారత్ ఈ సూచీలో 130వ స్థానంలో నిలవగా, ఇప్పుడు రెండు స్థానాలు పతనమైంది. అయితే, ప్రస్తుత ర్యాంకులను, 2020 నాటి ర్యాంకులతో పోల్చలేమని యూన్ డీపీ పేర్కొంది. 2020లో 189 దేశాలతో మానవాభివృద్ధి రేటును గణించామని, ఈసారి 191 దేశాలను పరిగణనలోకి తీసుకున్నామని వివరించింది. కరోనా సంక్షోభం, ఉక్రెయిన్ లో యుద్ధ వాతావరణం, ప్రమాదకర పర్యావరణ మార్పులు ఆయా దేశాల ర్యాంకులను ప్రభావితం చేసినట్టు తెలిపింది.

                                        

About Author