PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీలో ఎన్నిక‌లు జ‌రిగితే గెలుపెవ‌రిదో తెలుసా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్‌సీపీ మళ్లీ ఘన విజయం సాధిస్తుందని ఇండియా టుడే – సీ ఓటర్‌ సర్వే తేల్చి చెప్పింది. సార్వత్రిక ఎన్నికలు జరిగి 40 నెలలు పూర్తవుతున్నప్పటికీ, వైఎస్సార్‌సీపీ హవా ఏమాత్రం తగ్గలేదని స్పష్టం చేసింది. ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతోందని వెల్లడించింది. ఏకంగా 57 శాతం మంది ప్రజలు ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగనే కావాలని బలంగా కోరుకుంటున్నట్లుగా తేల్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాదరణలో సీఎం వైఎస్‌ జగన్‌కు దరిదాపుల్లో మరో నేత లేరని తెగేసి చెప్పింది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు రాష్ట్రంలో ఏమాత్రం ప్రభావం చూపబోవని ఈ సర్వేలో వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్‌ జగన్‌కు, వైఎస్సార్‌సీపీకి తిరుగులేదన్నది దీన్ని బట్టి తెలుస్తోందంటూ ఇండియా టుడే కన్సల్టింగ్‌ ఎడిటర్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్, ఇండియా టుడే గ్రూప్‌ న్యూస్‌ ఎడిటర్‌ రాహుల్‌ కన్వల్‌లు విశ్లేషించారు.

                                             

About Author