NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైద్యం చేయాలా ?.. ఎలుక‌లు ప‌ట్టాలా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వ‌రంగల్ ఎంజీఎంలో విధులు బహిష్కరించి వైద్యులు నిరసనకు దిగారు. ఎలుకల ఘటనలో వైద్యులపై చర్యలు తీసుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలుకలను పట్టడం వైద్యుల పనా…? అంటూ మండిపడుతున్నారు. వైద్యం చేయాలా..? లేదంటే ఎలుకలు పట్టాలా? అని వైద్యులు ఆందోళనకు దిగారు. ఇటీవ‌ల ఎంజీఎం ఆస్ప‌త్రిలో చేరిన ఓ రోగి ఎలుక‌ల దాడిలో మ‌ర‌ణించారు. దీంతో ఘ‌ట‌న‌కు బాధ్యుల్ని చేస్తూ వైద్యుల పై చ‌ర్య‌లు తీసుకున్నారు.

                                        

About Author