PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పల్లె ప్రజలకు వైద్యం అందించిన డాక్టర్లు

1 min read

పల్లెవెలుగు, వెబ్​ మిడుతూరు:ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లలేని వారికి ఇంటి దగ్గరికే వెళ్లి వైద్యం అందించిన కడుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఈ.శివ కుమార్ గౌడ్ మరియు 104 డాక్టర్ వంశీకృష్ణా రెడ్డి వెళ్లి వైద్య చికిత్సలు చేశారు.మండల పరిధిలోని మాసపేట గ్రామ పంచాయతీలో అనారోగ్యంతో బాధపడుతున్న వారి ఇంటి దగ్గరికి వెళ్లి వారికి వైద్య చికిత్సలు అందించిన తర్వాత వారికి,కుటుంబ సభ్యులకు సలహాలు సూచనలు తెలియజేశారు.ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ఫ్యామిలీ డాక్టర్ అనే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వైద్యులు తెలియజేశారు.ఈకార్యక్రమంలో మిడుతూరు మండల జడ్పిటిసి సభ్యులు పర్వత యుగంధర్ రెడ్డి,జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి వంగూరు జనార్దన్ రెడ్డి,అన్వర్ భాష,సిహెచ్ఓ రంగస్వామి, సూపర్వైజర్ ఏసేపు,పంచాయతీ కార్యదర్శి ఆశ్రఫ్ భాష, హెల్త్ అసిస్టెంట్లు సుగుణమ్మ,నిర్మల జ్యోతి,ఆశా కార్యకర్తలు శారదమ్మ,సువర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.

About Author