PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నారా లోకేష్ కు ఎయిడెడ్ విద్యాసంస్థ‌లంటే ఏంటో తెలుసా ?

1 min read

పల్లెవెలుగు వెబ్​: టీడీపీ యువ‌నేత లోకేష్‌కు ఎయిడెడ్‌ విద్యాసంస్థలంటే ఏంటో తెలుసా అని విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రశ్నించారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో చెప్పమనండంటూ అన్నారు. టీచర్లను ప్రభుత్వంలోకి తీసుకోవడం వల్ల వారు ఆనందంగా ఉన్నారని, ఆయా సంస్థలు ప్రభుత్వంలో కలవాలా వద్దా అనేది వారి ఇష్టానికే వదిలేశామ‌ని తెలిపారు. ‘‘చంద్రబాబు హయాంలో ఏనాడైనా ఎయిడెడ్‌ విద్యాసంస్థల గురించి ఆలోచించారా..?. ఈ రోజు వచ్చి తండ్రీ, కొడుకులు మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఆనాడు ఖాళీగా ఉన్న ఎయిడెడ్‌ టీచర్ల నియామకాలు చేసేది లేదని చెప్పింది చంద్రబాబు కాదా?. అనంతపురం సంఘటనలో రాళ్లు వేసింది ఎవరు? విద్యార్థిని స్పష్టంగా రాళ్లు వేశారని చెప్తుంటే లాఠీచార్జి అంటారేంటి..?. విద్యావ్యవస్థలో సమూల మార్పులు చేస్తున్న తరుణంలో ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదని ఇలాంటివి చేస్తున్నారు” అని విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ విమ‌ర్శించారు.

About Author