PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎర్రబాడు గ్రామంలో కుక్కల స్వైరవిహారం

1 min read

– కుక్కల దాడి నుండి ఇద్దరు బాలురను రక్షించిన గ్రామస్తులు
పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: గోనెగండ్ల మండల పరిధిలోని ఎర్రబాడు గ్రామంలో మల్లికార్జున రెడ్డి ఇద్దరూ కుమారులు ఇంటిదగ్గర ఆడుకుంటున్న గా ఒక్కసారిగా కుక్కల గుంపు పిల్లలపై దాడి చేశాయి. పిల్లల అరుపులు విని గ్రామస్తులు హుటాహుటిన కుక్కలను తరిమి వేయడంతో ప్రాణాపాయం నుండి ఆ చిన్నారులు బయటపడ్డారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మా గ్రామంలో చాలామంది చిన్నారులు కుక్కలు దాడికి గురవుతున్నారని, ఇకనైనా అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి మా గ్రామంలోని చిన్నారులను కాపాడాలని కోరుకుంటున్నారు.

About Author