PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కోవిడ్​ బాధిత పిల్లలకు ‘ గుడ్​నైబర్స్​’ చేయూత

1 min read

పల్లెవెలుగు కడప/రాయచోటి: జిల్లాలో కోవిడ్ తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు గుడ్ నైబర్స్ ఇండియా ఆర్గనైజేషన్ ద్వారా చేయూత అందిస్తున్నట్లు సంస్థ మేనేజర్ నాగేశ్వర తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ సి.హరికిరన్ చేతులమీదుగా పలువురు పిల్లలకు ఎడ్యుకేషన్ మెటీరియల్, యూనిఫామ్, శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. ప్రస్తుతం 150 మంది పిల్లలకు మెటిరియల్​, యూనిఫాం, శానిటైజర్​, మాస్కులు అందించడానికి ప్రణాళిక సిద్ధం చేశామని, మున్ముందు మరింత మంది పిల్లలను గుర్తించి సహాయ సహకారాలు అందిస్తామని సంస్థ మేనేజర్​ నాగేశ్వర్​ పేర్కొన్నారు. కార్యక్రమంలో జేసీ సాయికాంత్ వర్మ, ఐసిడియస్ పిడి పద్మజ, మైదుకూరు ఎంఎల్ఏ రఘురామిరెడ్డి, డిసిపిఓ సుబాష్ తదితరులు పాల్గొన్నారు.

About Author