PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సిపిఎంకు విరివిగా విరాళాలు ఇవ్వండి       

1 min read

సిపిఎం మండల కార్యదర్శి వి రంగారెడ్డి విజ్ఞప్తి   

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  ప్రజా సమస్యల కోసం నిరంతరం ముందుండి పోరాడే సిపిఎం పార్టీకి విరివిగా విరాళాలు ఇవ్వాలని సిపిఎం మండల కార్యదర్శి వి రంగారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం  పత్తికొండ మండల కేంద్రంలో  సీపీఎం  పార్టీ మాస్ ఫండ్ క్యాంపెయిన్ నిర్వహించారు. CPM పార్టీ మండల కార్యదర్శి రంగారెడ్డి ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ శ్రేణులు విరాళాల సేకరణ కార్యక్రమం విస్తృతంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు ఎం. దస్తగిరి, వెంకటేస్వర రెడ్డి, గోపాల్, సురేంద్ర, న్యాయవాది కాశీ విశ్వనాథ్, హుసేన్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

About Author