PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైతు బిడ్డ‌ల కోసం జీతం మొత్తం విరాళంగా !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇటీవ‌ల రాజ్యసభకు నామినేట్‌ అయిన మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌.. తన జీతం మొత్తాన్ని రైతు బిడ్డల సంక్షేమం కోసం విరాళంగా ఇవ్వనున్నట్టు ప్రకటించాడు. ‘ఎంపీగా నాకు వచ్చే జీతాన్ని రైతు బాలికల విద్య, సంక్షేమం కోసం విరాళంగా ఇవ్వాలని నిశ్చయించుకున్నా’ అని హర్భజన్‌ ట్వీట్‌ చేశాడు. గతేడాది క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన 41 ఏళ్ల హర్భజన్‌ను ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజ్యసభకు నామినేట్‌ చేసింది.

                                       

About Author