NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విమాన గోపురం నిర్మాణానికి విరాళం

1 min read

పల్లెవెలుగు వెబ్​, రాయచోటి: రాయచోటిలో వెలసిన దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీభద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం వారి విమాన గోపురం నిర్మాణానికి రూ. 50వేల 232 విరాళం అందజేశారు హైదరాబాదు వస్తువులు శ్రీ మతి గంగాభవాని రాజుల నాగరాజు దంపతులు. అదేవిధంగా 25 వేల 116 లు రాయచూరు తాలూక మాడ్గుల వాస్తవ్యులు శ్రీ వీరు పాక్షయ్య స్వామి 25 వేల 116 లు విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని యాక్సిస్ బ్యాంకు నందు డిపాజిట్ చేశామని, గోపురం నిర్మాణానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ఆలయ ఈవో మంజుల దాతలను కోరారు. అనంతరం దాతలకు అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి..అభినందనలు తెలియజేశారు.

About Author