PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అవినాష్​ రెడ్డి వినతితో..250 ఆక్సిజన్​ సిలిండర్లు అందజేత

1 min read

పల్లెవెలుగు వెబ్​, కడప బ్యూరో : కోవిడ్​–19 బాధితులు ఆక్సిజన్​ అందక మృత్యువాత పడరాదన్న ఉద్దేశంతో పార్లమెంట్​ సభ్యులు వైఎస్​ అవినాష్​ రెడ్డి దాతలు ముందుకొచ్చి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న రోగులకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వినతి మేరకు .. ఆదాని గ్రూపు యాజమాన్యం పులివెందులలో 250 ఆక్సిజన్ సిలిండర్లు, 30 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను జాయింట్​ కలెక్టర్​ సాయికాంత్​ శర్మ, సబ్​ కలెక్టర్​ పృథ్వి తేజ్​కు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి సియం అంజాద్ బాష ,కడప పార్లమెంట్ సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి , మేయర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.




About Author