PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘శ్రీ పోలేరమ్మ’ దేవాలయంకు.. రూ.50వేలు విరాళం: ఏఎస్​ఐ రామచంద్రరావు

1 min read

పల్లెవెలుగు వెబ్​: భక్తుల కోర్కెలు తీర్చే మహిమగల తల్లి శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ దేవాలయం పున: నిర్మాణం, మండపం, ఆర్చి నిర్మాణం కోసం సెకండ్​ ఏపీఎస్పీ బెటాలియన్​ కర్నూలులో విధులు నిర్వహిస్తున్న (ఏఎస్​ఐ–165 ) కె. రామచంద్ర రావు రూ.50వేలు విరాళం అందజేశారు. స్వస్తిశ్రీ శుభకృత్​నామ సంవత్సర చైత్ర మాసం పంచమి రోజు(ఈ నెల 6వ తేదీ)న  ప్రకాశం జిల్లా చందలూరు గ్రామంలో వెలిసిన శ్రీ పోలేరమ్మ తల్లి తిరుణాలు అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా రాష్ట్రనలుమూలల నుంచి దాతలు, భక్తులు అమ్మవారి దేవాలయం పున:నిర్మాణం కోసం విరాళం అందజేశారు. అందులో భాగంగా సెకండ్​ ఏపీఎస్పీ బెటాలియన్​ ఏఎస్​ఐ–165 కె. రామచంద్రరావు,  ఏపీజీబీ అసిస్టెంట్​ మేనేజర్​ బుచ్చయ్య( నాగసముద్రం బ్రాంచ్​) విరాళం ఇచ్చారు.  ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఏఎస్​ఐ కె. రామచంద్రరావు.. మున్ముందు  పేదలు, అనాథలు, వృద్ధులకు మరెన్నో సేవలు అందిస్తానన్నారు .

About Author