PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌పై గాడిద దొంగ‌త‌నం కేసు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తెలంగాణ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌పై గాడిద దొంగ‌త‌నం కేసు న‌మోద‌యింది. దీనిపై టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ‘‘కల్వశుంఠ’’ కళ్ల ముందు కనిపిస్తుండగా గాడిద దొంగతనం కేసు పెట్టడం దుర్మార్గమంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. నిరుద్యోగ యువత కోసం ప్రశ్నిస్తే.. బుద్ధిలేని గాడిదకు కోపం ఎందుకని ప్రశ్నించారు. అక్రమ నిర్బంధాలను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో ఎన్‌ఎ్‌సయూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్‌తో పాటు కార్యకర్తలపై గాడిద దొంగతనం కేసు నమోదు చేయడంపై స్పందిస్తూ ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ట్వీట్‌కు అనుంబంధంగా రిమాండ్‌ డైరీ కాపీని, గాడిద ఫొటోను పోస్ట్‌ చేశారు.

                                         

About Author