PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాండ్ర పై వస్తున్న వదంతులు నమ్మవద్దు

1 min read

తప్పుడు ఆరోపణలు అధికార పార్టీ నేతల కుట్రలు

టీడీపీకి లభిస్తున్న ఆదరణను ఓర్వలేకనే వైసీపీ తప్పుడు ప్రచారం

నందికొట్కూరు లో టీడీపీ జెండాను ఎగురవేస్తాం

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు టీడీపీ నేత నంద్యాల    పార్లమెంట్  ఇన్చార్జి  మాండ్ర శివానందరెడ్డి పై వచ్చిన ఆరోపణలు వాస్తవం కాదని నందికొట్కూరు టీడీపీ అభ్యర్థి గిత్త జయసూర్య, మాజీ ఎంపీపీ ప్రసాద్ రెడ్డి, టీడీపీ నాయకులు మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి లు పేర్కొన్నారు.  నందికొట్కూరు నియోజకవర్గం లో  తెలుగుదేశం పార్టీకి  ప్రజల నుంచి  లబిస్తున్న  ఆదరణను చూసి  టీడీపీలో   బలమైన నాయకుడుగా మాండ్ర  ఎదుగుదలను ఓర్వలేని వైసీపీ నాయకులు కుట్ర అని అన్నారు. సోమవారం నందికొట్కూరు మండలం బ్రహ్మణకొట్కూరు గ్రామంలో టీడీపీ నాయకులు గౌరు స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  వైసీపీ నాయకుల కుట్రలో భాగంగా సోమవారం ఉదయం తెలంగాణ పోలీసులు ఏలాంటి అనుమతులు ,స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా మాండ్ర  ఇంటిలోకి ప్రవేశించి తనిఖీలు చేపట్టడం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు కార్యకర్తలు మీరు ఎవరు ఎందుకు వచ్చారని ప్రశ్నించగా వారి నుంచి ఏలాంటి సమాధానం రాలేదన్నారు. చివరికి తెలంగాణ సీసీఎస్ నుంచి వచ్చాం మాండ్ర ను విచారణ కోసం తీసుకెళ్లాలి అని తెలిపారు. ఎలాంటి నోటీసులు లేకుండా కేవలం కక్ష్య పూరితంగానే వైసీపీ నేతలు తెలంగాణ పోలీసులతో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు చెందిన పోలీసు అధికారి వైసీపీ నేతల కనుసన్నల్లోనే పనిచేస్తున్నారని ఆరోపించారు.ఎన్ని కుట్రలు చేసిన టీడీపీ విజయాన్ని అడ్డుకోవడం వైసీపీ నేతలకు సాధ్యం కాదని అన్నారు. నందికొట్కూరు నియోజకవర్గం లో టీడీపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో టీడీపీ నాయకులు ఖాతా రమేష్ రెడ్డి, గిరీశ్వర రెడ్డి, పలుచాని మహేశ్వర రెడ్డి, మండ్లెం మోహన్ రెడ్డి,  ఓబుల్ రెడ్డి ,షకీల్ అహమ్మద్, నిమ్మకాయల రాజు, చంద్రేష్, శ్రీనివాసులు, నిమ్మకాయల మోహన్, లాయర్ జాకీర్, తదితరులు పాల్గొన్నారు.

About Author