PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వాళ్ల‌తో పెట్టుకోవ‌ద్దు… ర‌ష్యాకు ఆనంద్ మ‌హీంద్ర సూచ‌న !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ర‌ష్యా, ఉక్రెయిన్ మ‌ధ్య యుద్ధం పై ప్ర‌ముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మ‌హీంద్ర ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఉక్రెయిన్‌ దేశ భూభాగాల్ని స్వాధీనం చేసుకుంటున్న రష్యా మిలటరీని నినదిస్తూ స్థానికులు ప్లకార్డ్‌లతో ఆందోళన చేస్తున్న విడియోల్ని సోషల్‌ మీడియాతో పంచుకున్నారు. ఉక్రెయిన్‌ నగరానికి చెందిన ఖేర్‌సన్‌ అనే ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు రష్యన్‌ బలగాలు పెద్ద ఎత్తున మొహరించాయి. అయితే ఆ బలగాలకు వ్యతిరేకంగా ప్రొటెస్ట్‌ చేస్తున్న వీడియోలు నెట్టింట్లో చక్కెర్లు కొడుతున్నాయి. రష్యా సైన్యాన్ని ఉద్దేశిస్తూ ఒక సైన్యం నిరాయుధ పౌరులను ఎదుర్కోవలసి వస్తే..వాళ్లు యుద్ధ ట్యాంకుల కంటే శక్తివంతమైన ఆయుధాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. సత్యాగ్రహాం జయించలేని శక్తి. కావాలంటే ఒక్కసారి బ్రిటిష్ వాళ్లని అడగండి అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

                                          

About Author