PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆహార పదార్థాల నాణ్యతలో రాజీ పడవద్దు

1 min read

ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని సందర్శించిన

జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్న ప్రసాద్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. రత్నప్రసాద్  సోమవారం శనివారపేటలో ని ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని సందర్శించారు. వసతి గృహంలోని బాలురకు అందించే సౌకర్యాల పైన వివరణ అడిగి తెలుసుకున్నారు,  పరిసరాల శుభ్రత, ఆహార నాణ్యత మరియు విద్యాబోధన మొదలైన అంశాలపై వసతిగృహములోని బాలురలను వ్యక్తిగతంగా అడిగి తెలుసుకున్నారు. తదనంతరం సిబ్బందితో పాటు మాట్లాడుతూ పరిసరాలు మరింత శుభ్రంగా ఉండాలని అలాగే ఆహార పదార్థాల నాణ్యతలో రాజీ పడవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో  వసతి గృహం సూపరింటెండెంట్ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.

About Author