PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాహుల్ గడ్డం గీయొద్దు.. ఏపీ యువత

1 min read

పల్లెవెలుగువెబ్ : తమిళనాడులో మొదలైన ఈ యాత్ర కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లను దాటుకుని తెలంగాణ చేరింది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని యాత్రకు కాస్తంత విరామం ఇచ్చిన రాహుల్ గాంధీ… ఏపీలో సాగిన యాత్ర గురించి ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలతో మంగళవారం పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ ఏపీకి చెందిన మహిళా నేత ఓ ఆసక్తికర అంశాన్ని రాహుల్ ముందు ఉంచారు. జోడో యాత్ర ముగిసే దాకా రాహుల్ గాంధీ గడ్డం గీయొద్దంటూ ఏపీ యువత కోరుతున్నారని ఆమె రాహుల్ కు చెప్పారు. ఈ వినతికి ఔననో, కాదనో ఆన్సర్ ఇవ్వని రాహుల్… చూద్దాంలే అన్నట్లుగా స్పందించారు.

About Author