PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘నా క‌ష్టం శ‌త్రువుకు కూడ రావొద్దు’ !

1 min read

పల్లెవెలుగు వెబ్​ : హుజురాబాద్ ఉపఎన్నిక‌ల్లో భారీ విజ‌యం త‌ర్వాత ఈట‌ల రాజేంద‌ర్ మాట్లాడారు. హుజూరాబాద్‌ ప్రజలను అన్ని రకాలుగా భయబ్రాంతులకు గురి చేశారని, తనపై కుట్రలు చేసిన వారు కుట్రలతోనే నాశనమైపోతారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. తనకు వచ్చిన కష్టం శత్రువుకు కూడా రావద్దన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో రెండు గుంటల మనిషి 400 కోట్లు ఎలా ఖర్చుపెట్టాడని ప్రశ్నించారు. ఈ ఎన్నికలో కేసీఆర్‌ అహంకారంపై ప్రజలు గెలిచారని తెలిపారు. తాను ఇంతకు ముందు కేసీఆర్‌ బొమ్మపెట్టుకుని పోటీ చేసినప్పటి కంటే ఈ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించానని చెప్పారు. దాదాపు 23 వేల‌కు పైగా ఓట్ల‌తో ఈట‌ల రాజేంద‌ర్ విజ‌య‌దుందుభి మోగించారు.

About Author