NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మంచి చేసే వ్యక్తులను మర్చిపోవద్దు… టి.జి భరత్

1 min read

వ్యాపారస్తులకు అండగా ఉంటా… టి.జి భరత్

షరాఫ్ బజార్లో పర్యటించి వ్యాపారస్తుల సమస్యలు తెలుసుకున్న టి.జి భరత్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలుకు మంచి చేసే వ్యక్తులను ఎప్పటికి మర్చిపోవద్దని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జీ టి.జి భరత్ అన్నారు. మంగళవారం నగరంలోని షరాఫ్ బజార్లో ఆయన పర్యటించారు. వ్యాపారస్తులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వ్యాపారస్తులకు అంతా మంచే జరుగుతుందన్నారు. కర్నూలులో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. షరాఫ్ బజార్లో వ్యాపారస్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వ్యాపారస్తులకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తాను గెలిచిన వెంటనే తీరుస్తానని చెప్పారు. కర్నూలుకు పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు అందరి ఆదాయం పెంచుతానని హామీ ఇచ్చారు. ఒక్క కంపెనీ వచ్చినా అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయని వివరించారు. ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని.. వచ్చే ఎన్నికల్లో తనకి ఓటు వేసి తన పాలన చూడాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ ఓట్లను చెక్ చేసుకోవాలని సూచించారు.

About Author