NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎంత‌టి వారైనా వ‌దిలిపెట్టొద్దు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా పబ్‌ వ్యవహారంపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. బాలికపై అత్యాచార ఘటనపై కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. హైదరాబాద్‌లో అత్యాచార ఘటన వార్తలు చూసి షాక్‌ గురయ్యానన్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని హోంమంత్రి మహూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌ రెడ్డిని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. హోదాతో సంబంధం లేకుండా నిందితులు ఎంతటి వారైనా విడిచిపెట్టవద్దని అన్నారు. నిస్పక్షపాత విచారణ జరిపించాలన్నారు.

                                         

About Author