NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వారిని వ‌దిలిపెట్టం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ పోలీసుల తీరు పై టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సీఐడీ పోలీసుల చేష్టలు పరాకాష్టకు చేరుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. సుప్రీం కోర్టు నిబంధనలను కూడా పట్టించుకోకుండా వ్యవహరిస్తోందన్నారు. ఎంపీ రఘురామకృష్ణం రాజు విషయంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న జగన్ ప్రభుత్వానికి సిగ్గు ఎగ్గు లేవన్నారు. సోషల్ మీడియాలో ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారని, సోషల్ మీడియా యాక్టివిస్టులు అయిన వెంకటేష్, సాంబశివరావు విషయంలో వ్యవహరించిన తీరు అమానుషమని పేర్కొన్నారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, తప్పుడు కేసులు బనాయించే అధికారులను వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు.

                                                      

About Author