PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మ‌ళ్లీ మ‌ళ్లీ మాట్లాడ‌టం ఇష్టంలేదు : స‌మంత‌

1 min read

పల్లెవెలుగు వెబ్​ :నాగ‌చైత‌న్యతో విడాకుల అంశం పై తాజాగా స‌మంత స్పందించింది.  ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె విడాకుల అంశంపై మాట్లాడింది. ఆ విష‌యం గురించి త‌నకు మళ్లీ మళ్లీ మాట్లాడడం ఇష్టం లేదని చెప్పింది. తామిద్దరం విడిపోవడంపై చాలా మంది చాలా రకాలుగా అనుకుంటున్నారని, కానీ తన అభిప్రాయం ఏంటో ఇప్పటికే చెప్పేశానని పేర్కొంది. ఈ ఆంశంపై మళ్లీ మళ్లీ స్పందించాల్సిన అవసరం తనకు లేదని సామ్‌ చెప్పుకొచ్చింది. 2017లో ఒక్కటైన నాగ‌చైత‌న్య‌, స‌మంత జంట‌.. 2021 అక్టోబ‌ర్ 2న విడిపోతున్నట్టు ప్రక‌టించారు.

About Author