PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

“కనులు లేవని నీవు కలత పడ వలదు”

1 min read

– కంటి చూపు కోల్పోయిన ఆత్మీయుడికి సాయినాథ్ శర్మ ఆపన్న హస్తం
పల్లెవెలుగు వెబ్ కమలాపురం : కంటిచూపు కోల్పోయి కష్టాల్లో కొట్టు మిట్టాడుతున్న ఆత్మీయుడి కి తెలుగు దేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి, తెలుగు నాడు ప్రజా సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ ఆర్ధిక సహాయం అందించడంతో పాటు అన్నింటికీ తాను తోడున్నానంటు బరోసా ఇవ్వడంతో కంటి చూపు కోల్పోయిన ఆత్మీయుడి లో ఆనందం వెల్లి విరిసింది. కమలాపురం మండలం ఈడిగపల్లె గ్రామానికీ చెందిన చంద్ర అనే వ్యక్తి గత కొంతకాలంగా కంటిలో నరాల బలహీనత కారణంగా కంటిచూపు కోల్పోయాడు. అంతేగాక గత కొంత కాలంగా చంద్ర అనారోగ్యం తో బాధపడుతూ ఉండడం హైదరాబాద్ కి వెళ్ళి చికిత్స చేపించుకొని, వచ్చినప్పటికీ కంటిచూపులో ఏమాత్రం ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో చంద్ర జీవనగమనమే చాలా కష్టంగా మారింది. చంద్ర పడుతున్న ఇబ్బందులను గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకులు దేశం జగన్ రెడ్డి ,నంద్యాల శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడిగా ఉన్న కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ దృష్టికి గురువారం ఉదయం తీసుకురావడంతో ఆయన వెంటనే స్పందించి గురువారం మధ్యాహ్నం చంద్ర ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించి పది వేల రూపాయల ఆర్థిక సహాయం అందించి చంద్రా కు దైర్యం ఇచ్చారు. కంటిచూపు కోల్పోయినందున అధైర్య పడవద్దని తాను అన్నింటికీ సహాయం చేస్తానని చంద్ర కుమారుడు విద్యాభ్యాసానికి సైతం తాను ఆర్థిక సహాయం చేస్తానని పూర్తి హామీ ఇవ్వడంతో కంటి చూపు కోల్పోయిన చంద్రా మనసులో ఆనందం పొంగి పోర్లింది. కాగా కంటిచూపు కోల్పోయి ఇబ్బందులు పడుతున్న చంద్ర కుటుంబానికి చేదోడుగా నిలిచి చంద్రలో ధైర్యం నింపిన సాయినాథ్ శర్మను గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు.

About Author