PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పిచ్చిరాత‌లు రాసి… నాశ‌నం చేయెద్దు..

1 min read

ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో బిగ్ బాస్ ఫేమ్ ఆషురెడ్డి గురించి విప‌రీతంగా ట్రోలింగ్ జ‌రిగింది. దీని మీద తీవ్రంగా స్పందించింది ఆషూ రెడ్డి. త‌న మీద పిచ్చి రాత‌లు రాసేవాళ్లు పున‌రాలోచించుకోవాల‌ని కోరింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే వీరాభిమానం త‌ప్ప.. ఇంకొక‌టి ఉండ‌ద‌ని చెప్పింది. అభిమాని చ‌చ్చేంత వ‌ర‌కు అభిమానే.. కానీ ఇంకొక‌లా ఉండ‌ర‌ని చెప్పుకొచ్చింది. ఇంకొక‌సారి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎవ‌రినైనా ప‌ల‌క‌రించాల‌న్న భ‌య‌ప‌డే ప‌రిస్థితిని కొంద‌రు క‌ల్పిస్తున్నార‌ని ఆవేద‌న వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి ఇన్​స్టాగ్రామ్ లో వీడియో విడుద‌ల చేసింది. ఇటీవ‌ల తాను ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న ఫ‌స్ట్ ల‌వ్ అని కామెంట్ చేసింది.. కేవ‌లం అభిమానంతోన‌ని తెలిపింది. దీనిని అవ‌కాశంగా తీసుకొని కొంద‌రు త‌న‌ను బ‌ద‌నాం చేస్తున్నార‌ని విమ‌ర్శించింది. మంచిని ప్రోత్సహించాల్సిన వారే.. చెడును ప్రోత్సహిస్తున్నార‌ని విచారం వ్యక్తం చేసింది. ఇప్పటికైన త‌న మీద ట్రోలింగ్ ఆపాల‌ని కోరింది.

About Author