PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దోశె తిని.. రూ. 71 వేలు తీసుకెళ్లండి !

1 min read

పల్లెవెలుగువెబ్ : ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌లో ఉన్న స్వామి శక్తి సాగర్ రెస్టారెంట్ యజమాని కస్టమర్లను ఆకర్షించేందుకు వినూత్నంగా ఆలోచించాడు. తన రెస్టారెంట్‌లో దోశ తింటే రూ.71వేలు ఇస్తానని ప్రకటన విడుదల చేశాడు. అయితే ఇందుకు షరతులు వర్తిస్తాయని ఆ ప్రకటనలో పేర్కొన్నాడు. తన రెస్టారెంట్‌లో చేసే 10 అడుగుల దోశ తిన్న వారికి మాత్రమే ఆఫర్ వర్తిస్తుందని వెల్లడించాడు. అంతేకాకుండా కేవలం 40 నిమిషాల్లోనే ఆ దోశను తినేయాలని షరతు విధించాడు. ఫుడ్ లవర్స్ ఎవరైనా 40 నిమిషాల్లో 10 అడుగుల దోశను తినగలమని అనుకుంటే ముందుకు రావాలని ఛాలెంజ్ విసిరాడు.

             

About Author