మహానంది లో డి పి ఓ పూజలు
1 min read
మహానంది, న్యూస్ నేడు: మహానంది పుణ్యక్షేత్రంలో నంద్యాల జిల్లా పంచాయితీ అధికారి లలితా బాయి పూజలు నిర్వహించారు. మంగళవారంస్వామివారి దర్శనానికి వచ్చిన వారికి ఆలయ ముఖమండపం వద్ద దేవస్థానం ఉద్యోగులు స్వాగతం పలికారు. ముందుగా శ్రీకామేశ్వరీ దేవి సహిత మహానందీశ్వర స్వామివార్ల కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆనవాయితీ ప్రకారం కళ్యాణ మండపంలో వేదపండితుల ఆశీర్వచసనం మధ్య టెంపుల్ ఇన్స్పెక్టర్ మల్లయ్య కండువా కప్పి స్వామివారి మేమేంటోతో పాటు ప్రసాదాలను అందజేశారు. వారివెంట ఈఓఆర్డీ నాగేంద్రుడు, పంచాయితీ సెక్రటరి భాస్కర్, తదితరులు ఉన్నారు.