PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్సీ గా డా. పోతుల నాగరాజు ను గెలిపించండి

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: పట్టభద్రులు ఎమ్మెల్సీగా అభ్యర్థి డాక్టర్. పోతుల నాగరాజు ను గెలిపించాలని శుక్రవారం నందికొట్కూరు మండలంలోని బొల్లవరం గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పి. పకీర్ సాహెబ్ మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై ఉద్యమమే ఊపిరిగా , ప్రభుత్వ ఉపాధ్యాయునిగా రాజీనామా చేసి నీతి నిజాయితీగా విలువలతో కూడిన వ్యక్తి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగరాజు కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. పట్టభద్రులు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల ఉపాధ్యక్షులు వేణుగోపాల్ , కెవిపిఎస్ నాయకులు వెంకటేశ్వర్లు, విజయుడు, గ్రామస్తులు పాల్గొన్నారు.

About Author