PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

30 న డా .టి .పుల్లన్న ప్రథమ వర్థంతి సభ

1 min read

పల్లెవెలుగు, వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా కురువ సంఘము ఆధ్వర్యంలో ఈ నెల 30 వ తేదీన ఆదివారం మాజీ గౌరవ అధ్యక్షులు కీ.శే .డా .టి .పుల్లన్న గారి ప్రథమ వర్ధంతి సభ జరుపుతున్నామని కర్నూలు జిల్లా కురువ సంఘము గౌరవ అధ్యక్షులు కే .కిష్టన్న ,జిల్లా అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శి పత్తికొండ శ్రీనివాసులు ,ఎం .కే .రంగస్వామి ,జిల్లా అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న తెలిపారు మంగళ వారం ఉదయం నగరం లోని సంఘం కార్యాలయం లో జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది .ఈ సమావేశం లో జిల్లా అధ్యక్షుడు పత్తికొండ శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ నెల 30 వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు నగరం లోని జిల్లా పరిషత్ ఆవరణ లోని మండల పరిషత్ సమావేశ భవనం నందు కీ .శే .డా .టి .పుల్లన్న గారి ప్రథమ వర్ధంతి సమావేశం జరుగుతుందని ,ఈ సమావేశమునకు జిల్లా లోని బి .సి.,ఎస్ .సి .ఎస్ .టి .మరియు కుల సంఘాల ప్రతినిధులు డాక్టర్లు ,జిల్లా లోని కురువ కులజులు సర్పంచ్ లు ,ఎంపీటీసీ లు ,జడ్పీటీసీ లు ,కౌన్సిలర్లు ,కార్పొరేటర్లు ,మండల కమిటీ నాయకులు పాల్గొని సభను జయప్రదం చేయవలెనని కోరారు .ఈ సమావేశం లో జిల్లా ఉపాధ్యక్షులు బి .వెంకటేశ్వర్లు ,కత్తి శంకర్ ,టి .ఉరుకుందు ,,జిల్లా కోశాధికారి కే .సి .నాగన్న ,టి .పాలసుంకన్న ,నగర అధ్యక్ష ,కార్యదర్శి తవుడు శ్రీనివాసులు ,బి .రామకృష్ణ ,బి .సి .తిరుపాల్ ,కే .దివాకర్ ,బి .బాలరాజు ,అడ్వకేట్ మద్దిలేటి ,పర్ల లింగన్న ,వెంకటేశ్వర్లు ,పెద్దపాడు పుల్లన్న ,కే .దామోదర్ ,రామకృష్ణ ,కే .దేవేందర్ ,శివ తదితరులు పాల్గొన్నారు .

About Author