PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్డీఏ అభ్య‌ర్థిగా ద్రౌప‌ది

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఒడిసాకు చెందిన ఆదివాసీ గిరిజన మహిళా నాయకురాలు ద్రౌపది ముర్ము ఎంపికయ్యారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దాదాపు రెండు గంటలకు పైగా జరిగిన భేటీలో 20 పేర్లపై విస్తృత చర్చ జరిగిందని, చివరకు ఆదివాసీమహిళకు అవకాశం ఇవ్వాలని నిశ్చయించినట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా విలేకరులకు వెల్లడించారు. తూర్పు భారతం నుంచి ఇప్పటి వరకూ ఎవరూ రాష్ట్రపతి కాలేదని, ఆదివాసీకి కూడా అవకాశం లభించలేదని, మహిళకు అవకాశమివ్వాలని బోర్డు సభ్యులు పలువురు సూచించారని తెలిపారు.

                                            

About Author