PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎంపీపీ పాఠశాల ప్రాంగణంలో త్రాగునీటి బోరు

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మండల పరిధిలోని కడుమూరు గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల(మెయిన్)లో విద్యార్థులకు నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నందున ఎంపీపీ పాఠశాల మరియు గ్రామపంచాయితీ నిధుల ద్వారా త్రాగునీటి బోరును వేయించినట్లు గ్రామ సర్పంచ్ ఎస్.జీవరత్నం తెలిపారు. ఈత్రాగునీటి బోరును గ్రామ సర్పంచ్ మరియు మండల విద్యాశాఖ అధికారి పి.మౌలాలి ఆధ్వర్యంలో బోరును వేయించారు.బోరులో నుండి నీళ్లు రావడం వలన విద్యార్థులు,ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.ఈకార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శివ కళ్యాణ్ సింగ్,వెల్ఫేర్ అసిస్టెంట్ రహిమాన్ తదితరులు పాల్గొన్నారు.

About Author